సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం
27-07-2026 11:31 AM
బోథ్, జులై 27(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ఐదు సంవత్సరాల క్రితం ప్రస్తుత ఎంపీ నగేష్ విద్యార్థుల కోసం శుద్ధ జలం ప్లాంటును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా శుద్ధ జలం ప్లాంటు చెడిపోవడంతో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్రప్రసాద్ ప్లాంటుకు మరమ్మతులు చేయించారు.దీంతో విద్యార్థులు శుద్ధ జలం వినియోగించుకోనున్నారు. శుద్ధ జలం ఏర్పాటు పట్ల పాఠశాల విద్యార్థులు హర్షం వ్యక్తపరుస్తున్నారు.






