21 August, 2026 | 10:24 PM

సాలూరలో SIR-2026 నోటీస్ జనరేషన్ ప్రక్రియ పరిశీలన

21-08-2026 09:17 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్ డివిజన్ ఆర్‌డీఓ శుక్రవారం సాలూర మండలంలో సర్-2026 నోటీస్ జనరేషన్ ప్రక్రియను పరిశీలించారు. సాలూర తహసీల్దార్‌తో కలిసి ప్రక్రియ కొనసాగుతున్న తీరును పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం సాలూర మండలంలో నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణం కోసం గుర్తించిన స్థలాన్ని ఆర్‌డీఓ పరిశీలించారు. సర్వే నంబర్లు 1945లో 25 గుంటలు, 1946లో 5 గుంటలు, 1947లో 36 గుంటలు, 1948లో 14 గుంటలు కలిపి మొత్తం 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలాన్ని ఆమె సందర్శించారు. నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించి స్థల వివరాలు, అందుబాటులో ఉన్న విస్తీర్ణం తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని సూచించారు.