ఉపాధి పనుల పరిశీలన
వాంకిడి,(విజయక్రాంతి): జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బి.దత్తారం శుక్రవారం వాంకిడి మండలంలోని సారండి గ్రామ పంచాయతీలో జరుగుతున్న సీసీటీ ఉపాధి హామీ పనుల ను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం 6 గంటలకే పనికి హాజరై, కొలతల ప్రకారం రోజుకు రూ.307 వేతనం పొందేలా పనులు చేయాలని సూచించారు. పని ప్రదేశాల్లో త్రాగునీరు, నీడ వంటి మౌలిక సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, సర్పంచ్ బాపూజీకి ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం ఉపాధి హామీ సిబ్బందితో సమావేశమై, గ్రామానికి సమీపంలో తవ్వకాలకు అనుకూలమైన పనులను గుర్తించి ప్రాధాన్యంగా చేపట్టాలని,సూచించారు.రైతులకు ఉపయోగపడే విధంగా పనులు చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, కొత్త పనుల కోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పై అధికారులకు పంపాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలాజీ, ఏపీఓ శ్రావణ్ కుమార్, ఈసీ మోసిన్, TA, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు ఉన్నారు.






