ముస్తాబాద్లో వైఎస్సార్ జయంతి వేడుకలు
* వైఎస్ఆర్ చిత్రపటానికి ఘన నివాళులు.
* మండల అధ్యక్షుడు గజ్జల రాజు
ముస్తాబాద్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గజ్జల రాజు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా రాజు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టి స్వయంగా ప్రజల సమస్యలు తెలుసుకొని రైతుల సంక్షేమం, ఉచిత విద్యుత్, ఆరోగ్య సేవల విస్తరణ,విద్యా ప్రోత్సాహం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. ప్రజలనే తన కుటుంబంగా భావించి,వారి సంక్షేమమే ద్యేయంగా కృషి చేసిన మహోన్నత ప్రజానాయకుడిని కొనియాడారు. అలాంటి నాయకుడు మన మధ్య లేకున్నా వారు అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలిపారు.ప్రజల హృదయాల్లో నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు.






