సీతారంపూర్లో అభివృద్ధి పనుల పరిశీలన
13-03-2026 01:50 PM
దోమకొండ, మార్చి13(విజయక్రాంతి): దోమకొండ మండలం సీతారంపూర్(Sitarampur) గ్రామంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీవో కలిసి శుక్రవారం పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న ఈజీఎస్ పనుల స్థలాన్ని సందర్శించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం యూపీఎస్ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కావాలని సూచించారు. గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంజీవులు, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




