13 May, 2026 | 9:59 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

స్థానిక ఎన్నికల షెడ్యూల్లో బీసీలకు అన్యాయం

28-11-2025 06:44 PM

బీసీ సంఘం మండల కన్వీనర్, లక్కినేని సురేందర్ రావు

టేకులపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన స్థానిక ఎన్నికల షెడ్యూల్ లో జనరల్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని టేకులపల్లి మండల బీసీ సంఘం కన్వీనర్ లక్కినేని సురేందర్ రావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని వీరబ్రహ్మద్రస్వామి దేవాలయంలో శుక్రవారం అత్యవసరంగా ఏర్పాటుచేసిన బీసీ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ... టేకులపల్లి మండలంలో అన్ని గ్రామ పంచాయతీలలో జనరల్, వార్డులను ఎస్టీలకు, ఎస్టి వార్డులను జనరల్ అభ్యర్థులకు కేటాయించారన్నారు. 

అంతేకాక  జనరల్ స్థానాలు కావడం వలన ఎస్టీలు కూడా ఆ వార్డులకు పోటీ చేసే అవకాశం ఉన్నందున జనరల్ అభ్యర్థులు పోటీ చేసిన గెలిచే అవకాశం లేదని వాపోయారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని జనరల్ అభ్యర్థులకు న్యాయం చేసేందుకు అన్ని పార్టీల అగ్ర నాయకులు ఆలోచించాలని కోరారు. జనరల్ స్థానాలలో జనరల్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలని ఆయన కోరారు. మళ్ళీ దీనిపై చర్చించేందుకు శనివారం ఉదయం 10 గంటలకు మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం వద్ద బీసీ సంఘం, మైనార్టీ, ఓసి సంఘాల సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల గురించి అన్ని కుల సంఘాల నాయకులతో చర్చించి తదుపరి కార్యచరణ చేపట్టనున్నట్లు తెలిపారు.