13 April, 2026 | 12:52 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నాణ్యతతో చేపట్టాలి

10-02-2026 06:48 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని బంజారా తండా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను, పెద్ద ఆత్మకూరులో ప్రభుత్వ పాఠశాలలను అంగన్వాడి కేంద్రామును, వాటిలో ఉన్న సదుపాయాలను, రాఘవపల్లి గ్రామంలో నర్సరీని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేసి నాణ్యతతో నిర్మించాలని సూచించారు. బంజర తండ గ్రామానికి 19 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు 19 ఇందిరమ్మ ఇండ్లు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

విద్యార్థులకు మెనూ ప్రకారము మంచి ఆహారాన్ని అందించాలని, ఉపాధ్యాయులు సమయాన్నిసారం పాటించాలని తెలిపారు. రాఘవపల్లిలో నర్సరీ నిర్వాణ సక్రమంగా చేపట్టి గ్రామానికి మొక్కల పెంపకం లక్ష్యాన్ని పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాఘవపల్లి గ్రామ సర్పంచ్ నార్ల గంగమని మల్లేశం, కార్యదర్శులు మమత, సావిత్రి, ఫీల్డ్ అసిస్టెంట్ మల్లవ్వ తదితరులు ఉన్నారు.