6 March, 2026 | 7:56 AM

ఖమేనీ మృతికి భారత్ అధికారికంగా సంతాపం

06-03-2026 02:39 AM

ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

న్యూఢిల్లీ, మార్చి 5 : ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి భారతదేశం సంతాపం ప్రకటించింది. ఇరా న్ అధినేత ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఇవాళ దేశ రాజధాని న్యూఢిల్లీలో ని ఇరాన్ రాయబార కార్యాలయంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అధికారికం గా సంతాప సందేశం రాశారు.

భారత ప్రభు త్వం తరఫున విదేశాంగ కార్యదర్శి ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లారు. సంతా ప సందేశాన్ని రాసిన అనంతరం మిస్రీ ఇరాన్ రాయబారితో కాసేపు మాట్లాడారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించినట్లు తెలుస్తోంది.