భారత్ మానవత్వంతో వ్యవహరించింది
- ఇరాన్ అభ్యర్థన మేరకే కొచ్చిలో నౌకల డాకింగ్కు అనుమతి
విదేశాంగ మంత్రి జైశంకర్
న్యూఢిలీ, మార్చి 7 : అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ నావికాదళ నౌకను కొచ్చిలో డాక్ చేయడానికి అనుమతించడంలో భౌగోళిక రాజకీయ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా భారతదేశం ‘మానవత్వం’తో వ్యవ హరించిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న రైసినా డైలాగ్ 2026 వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ హిందూ మహాస ముద్రంలో ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలు, ఇరాన్ నౌకలకు భారత్ ఇచ్చిన అనుమతులపై వివరణ ఇచ్చారు.
హిందూ మహాసము ద్రంలో మూడు ఇరాన్ నౌకలు ఫిబ్రవరిలో విశాఖపట్నంలో జరిగిన మిలాన్- 2026 (మిలన్ 2026) విన్యాసాల్లో పాల్గొన్నాయి. అయితే, మార్చి మొదటి వారంలో అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముదరడంతో ఈనౌకలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. మార్చి 1న ఇరాన్ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు, మానవీయ కోణంలో ఆలోచించి వాటికి కొచ్చి పోర్టులో డాకింగ్ అనుమతి ఇచ్చినట్లు జైశంకర్ తెలిపారు. భారత్ చట్టపరమైన అంశాల కంటే మానవత్వానికే పెద్దపీట వేసిందన్నారు.




