27 April, 2026 | 11:48 AM

Breaking News

న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు: కేజ్రీవాల్ సంచలన నిర్ణయం   •   హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి   •   హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. ​ఎక్కడ చూసిన నో స్టాక్ బోర్డులు   •   నార్కెట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం: సాఫ్ట్‌వేర్ మృతి   •   ప్రతి కుటుంబం ఖచ్చితంగా వివరాలు నమోదు చేసుకోవాలి: భట్టి విక్రమార్క   •   బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఒక విప్లవం!   •   శ్రీవారి సేవలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు   •   దమ్మాయిగూడెం వద్ద రెండు లారీలు ఢీ   •   నిరుపేద చిన్నారి ప్రాణాల కోసం పోరాటం – దాతల సాయం కోసం తల్లిదండ్రుల విజ్ఞప్తి   •   బంకులు బంద్.. ప్రజలు పరేషాన్   •  

జల్సాలకు అలవాటు.. భార్యను హత్య చేసిన భర్త

24-12-2025 03:17 PM

హైదరాబాద్: మియాపూర్ పరిధిలో భార్యను భర్త హత్య చేశాడు. కొంతకాలంగా దంపతుల మధ్య వివాదం కొనసాగుతోంది. జల్సాలకు అలవాటు పడ్డ భర్త తీరు మార్చుకోవాలని భార్య కోరింది. నిన్న వాగ్వాదం తర్వాత అత్తింటికి వెళ్లేందుకు భార్య సిద్ధమైంది. మార్గం మధ్యలో భార్య విజయలక్ష్మిని అడ్డగించిన భర్త రాజు ఆమెతో గొడవపడ్డాడు. భర్త పిడిగుద్దలతో దాడి చేయడంతో విజయలక్ష్మి అక్కడికక్కడే కుప్పకూలింది. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విజయలక్ష్మి మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు నిందితుడు రాజును అరెస్ట్ చేశారు.