గుడిబండలో ఉద్యానవన శాఖ సమావేశం
06-05-2026 02:36 AM
కోదాడ, మే 5: కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామ పంచాయతీ లో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో గుడిబండ గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య, కోదాడ ఎంపీడీఓ ఇసాక్ హుస్సేన్, ఎంపీఓ రాంబాబు, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఉద్యాన వన శాఖ అధికారులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






