మండల సెకండ్ టాపర్ దివ్యశ్రీకి ఘన సన్మానం.
ములకలపల్లి,(విజయక్రాంతి): ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని తన్నీరు దివ్యశ్రీని చైతన్య ప్రెస్ క్లబ్ సభ్యులు శనివారం ఘనంగా సన్మానించారు. ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లి గ్రామానికి చెందిన దివ్యశ్రీ 547 మార్కులు సాధించి మండల సెకండ్ టాపర్గా నిలిచింది. చైతన్య ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఈర్ల రామ్మోహన్ రావు అధ్యక్షతన దివ్యశ్రీకి చిరు సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబానికి చెందిన దివ్యశ్రీ, చదువుపై మక్కువతో కష్టపడి మండల స్థాయిలో రెండో స్థానాన్ని దక్కించుకోవడం గర్వకారణమని కొనియాడారు. ప్రముఖ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న పవన్ కుమార్ కుమార్తెగా తండ్రి బాటలోనే క్రమశిక్షణతో చదివి నేటి తరం విద్యార్థులకు దివ్యశ్రీ ఆదర్శంగా నిలిచిందని వారు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.






