14 July, 2026 | 11:20 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

మండల సెకండ్‌ టాపర్‌ దివ్యశ్రీకి ఘన సన్మానం.

02-05-2026 07:27 PM

​ములకలపల్లి,(విజయక్రాంతి): ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని తన్నీరు దివ్యశ్రీని చైతన్య ప్రెస్ క్లబ్ సభ్యులు శనివారం ఘనంగా సన్మానించారు. ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లి గ్రామానికి చెందిన దివ్యశ్రీ 547 మార్కులు సాధించి మండల సెకండ్ టాపర్‌గా నిలిచింది. చైతన్య ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఈర్ల రామ్మోహన్ రావు అధ్యక్షతన దివ్యశ్రీకి చిరు సన్మానం నిర్వహించారు.​

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబానికి చెందిన దివ్యశ్రీ, చదువుపై మక్కువతో కష్టపడి మండల స్థాయిలో రెండో స్థానాన్ని దక్కించుకోవడం గర్వకారణమని కొనియాడారు. ప్రముఖ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న పవన్ కుమార్ కుమార్తెగా తండ్రి బాటలోనే క్రమశిక్షణతో చదివి నేటి తరం విద్యార్థులకు దివ్యశ్రీ ఆదర్శంగా నిలిచిందని వారు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ​