31 March, 2026 | 5:31 PM

హిందూ సమ్మేళనం కరపత్రం విడుదల

31-03-2026 03:57 PM

నిర్మల్,(విజయక్రాంతి): కుభీర్ గ్రామంలోనీ శ్రీ విట్ఠలేశ్వర ఆలయం నందు జరగబోయే హిందూ సమ్మేళనం కార్యక్రమం ఈనెల 7న నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం కరపత్రం విడుదల చేశారు. కుభీర్ ఉప మండలము నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనగలరని కమిటీ అధ్యక్షులు చిమ్మన్ అరవింద్  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోశ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు పూజ్య శ్రీశ్రీ కమలానంద భారతి స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొని, గోమాత పూజ కార్యక్రమం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, కుంకుమార్చన కార్యక్రమం జరుగును. ఇట్ కార్యక్రమంలో  సాయంత్రం 4 గంటలకు పాల్గొని విజయవంతం చేయగలరని వారు కోరారు