28 February, 2026 | 6:37 AM

ఘనంగా పాదయాత్ర, పల్లకీసేవ ప్రారంభం

28-02-2026 01:38 AM

నారాయణఖేడ్, ఫిబ్రవరి 27: మనూరు మండలంలోని బిల్లాపూర్ దత్తాత్రేయ ఆశ్ర మం నుండి బర్దిపూర్ వరకు పాదయాత్ర, పల్లకి సేవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా బర్దిపూర్ ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి మహారాజ్, సిద్దేశ్వర స్వామి మారాజులు పాల్గొని పాదయాత్ర కార్యక్రమం ప్రారంభించారు. శుక్రవారం రాత్రి నారాయణఖేడ్ చేరుకొని మరునాడు నారాయణఖేడ్ మీదుగా టి.లిం గంపల్లి వరకు పాదయాత్ర కొనసాగునుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.