15 June, 2026 | 2:21 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

వైభవంగా గోదాదేవి రంగనాయకుల కళ్యాణం

14-01-2026 08:27 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో బుధవారం నాడు వేద పండితుల చేత శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట గణపతి పూజ పుణ్య ఆవశనం అఖండ దీపారాధన అనంతరం కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనంతరం భక్తులు ఓడు బియ్యం పోసి మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బాపురెడ్డి సభ్యులు శేఖర్ నరసింహులు. సర్పంచ్ ఐరన్ నరసయ్య, ఉప సర్పంచ్ బొమ్మరి శ్రీనివాస్,వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్ కూరలత సంతోష్, మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్, నాయకులు కుంచాల శేఖర్,నల్లపు శ్రీనివాస్,నాగరాజ్ పోచయ్య, శంకర్, తదితరులు మొక్కలు చెల్లించుకున్నారు.