6 May, 2026 | 11:34 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

బాలికల సమస్యలు వచ్చినపుడు సమయస్ఫూర్తిగా వ్యవహారించాలి

19-12-2025 07:20 PM

జిల్లా కో-ఆర్డినేటర్ చైతన్య

తుంగతుర్తి,(విజయ క్రాంతి): మహిళా శిశు సంక్షేమ శాఖలోని, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో 'బేటీ బచావో - బేటీ పడావో' పథకంలో భాగంగా తుంగతుర్తి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల ఉన్నత పాఠశాల లో శుక్రవారం బాలికా చైతన్యo అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆర్డినేటర్ చైతన్య మాట్లాడుతూ.. బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని అన్నారు. సమాజంలో బాలికల పట్ల ఉన్న వివక్షను రూపుమాపడమే 'బేటీ బచావో - బేటీ పడావో' ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

​సందేశంలోని ముఖ్యాంశాలు: ​విద్యే ఆయుధం: ప్రతి బాలిక ఉన్నత చదువులు చదివి సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. ఆర్థిక స్వాలంబన సాధించినప్పుడే మహిళలకు గౌరవం లభిస్తుంది. 

​చట్టాలపై అవగాహన: బాల్య వివాహాల నిర్మూలన, పోక్సో చట్టం, మరియు మహిళా రక్షణ చట్టాల పట్ల ప్రతి విద్యార్థిని అవగాహన కలిగి ఉండాలి. 

ప్రభుత్వ ప్రోత్సాహం: ప్రభుత్వం బాలికల విద్య కోసం అందిస్తున్న రాయితీలు, వసతులను సద్వినియోగం చేసుకోవాలి. 

ఆరోగ్యం మరియు పరిశుభ్రత: చదువుతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారం పట్ల శ్రద్ధ వహించాలని విద్యార్థినులకు సూచించారు. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ వో కల్పన, మహిళా శిశు సంక్షేమ శాఖ జెండర్ స్పెషలిస్ట్ వినోద్, భవ్య మరియు తదితరులు పాల్గొన్నారు.