బడ్జెట్లో విద్యాశాఖకు 20 శాతం నిధులు ఇవ్వాలి
24-03-2026 06:33 PM
నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యాశాఖ కు 20% నిధులను కేటాయించే విధంగా పున పరిశీలన చేయాలని టిఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఆరేపల్లి విజయకుమార్ డిమాండ్ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యాశాఖ కు అరకురని నిధులు కేటాయించడం వల్ల ప్రభుత్వ విద్య మౌలిక సదుపాయాలు దూరమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కలిసి వినతి పత్రం అందించారు.




