సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ పత్రాల పంపిణీ, సేకరణ ప్రక్రియను బాన్సువాడ మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సూచనల మేరకు పట్టణంలోని వివిధ బూత్లలో ఎస్ఐఆర్ పత్రాల పంపిణీ, నింపిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించినట్లు తెలిపారు.
బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన ఓటర్లు తమ ఎస్ఐఆర్ పత్రాలను పూర్తిగా నింపి, సంబంధిత బూత్లలో విధులు నిర్వహిస్తున్న బూత్ లెవెల్ ఆఫీసర్ల కు సకాలంలో అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా ప్రతి ఓటరు తమ వివరాలను సమర్పించి, ఈ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఆయన వెంట రెండోవ వార్డు కౌన్సిలర్ జంగం రాజశేఖర్ తదితరులున్నారు.






