10 June, 2026 | 3:12 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ జీవితమంతా ప్రజలకే త్యాగం

13-10-2025 11:17 PM

ఆదిలాబాద్, (విజయక్రాంతి): సీపీఐ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, స్వర్గీయ గుండా మల్లేష్ జీవితం అంతా ప్రజల కోసం త్యాగాలు చేసిన చరిత్ర అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ గుండా మల్లేష్ 5వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కామ్రేడ్  మల్లేష్ మూడు సార్లు ఆసిఫాబాద్ శాసనసభ్యులుగా, ఒకసారి బెల్లంపల్లి శాసనసభ్యులుగా ప్రజలకు సేవలందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఝాన్సీ మండల కార్యదర్శి అర్ధాంగి రమేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు మహబూబ్ ఖాన్, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి అమీనా బేగం, కామ్లే రాందాస్, బెజ్జంకి నర్సింగరావు, కొడప సురేష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.