ఆలయాన్ని సందర్శించిన మాజీ మంత్రి
08-08-2026 03:23 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని అయ్యప్ప హరిహర క్షేత్రాన్ని మాజీ మంత్రి శనివారం సందర్శించారు. ఇటీవలే ఆలయంలో దొంగలు పడి వెండి కిరీటం, ఇతర వస్తువులు దొంగిలించడంతో జరిగిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట ఆలయ వ్యవస్థాపకులు మురళీధర్ రెడ్డి, పీఏసీ చైర్మన్ కృష్ణ ప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు.






