పాడి గేదెలకు గాలికుంటు నివారణ టీకాలు
09-04-2026 02:23 PM
కోహెడ, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): కోహెడ మండలం గుండారెడ్డిపల్లి లో పాడి గేదెలకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ పిల్లి బాబు మాట్లాడుతు.. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టినట్లు.. చెప్పారు. సుమారు 35 పాడి గేదెలకు టీకాలు వేసినట్లు పేర్కొన్నారు. మునుముందు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పశు వైద్యులు మహేందర్ రెడ్డి, చిట్టిరెడ్డి లక్ష్మారెడ్డి, మొండయ్య, రైతులు నాగిళ్ల నరసింహారెడ్డి తూళ్ళ కిష్టయ్య, తూళ్ళ సంతోష్, మద్దెల మల్లయ్య, శ్యామల రాజేశం, జాలిగాం యాదయ్య పాల్గొన్నారు.




