20 March, 2026 | 3:41 PM

గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు

20-03-2026 01:58 PM

హైదరాబాద్: శుక్రవారం మధ్యాహ్నం భద్రాచలంలో గోదావరి నదిలో(Godavari river) ఐదుగురు యువకులు మునిగిపోయారని పోలీసులు తెలిపారు. గొల్లగూడెం ఇసుక దిబ్బ వద్ద స్నానం చేయడానికి ఏడుగురు యువకులు నదిలోకి దిగారు. స్నానం చేస్తుండగా ఐదుగురు యువకులు మునిగిపోగా, మిగిలినవారు సురక్షితంగా నది కట్టకు చేరుకున్నారు. వారి నుండి సమాచారం అందిన వెంటనే, నది నుండి మృతదేహాలను వెలికితీసేందుకు జిల్లా యంత్రాంగం నిపుణులైన ఈతగాళ్లను మోహరించింది. ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకులు గల్లంతు కావడంతో వారి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.