20 March, 2026 | 3:52 PM

బడ్జెట్ ప్రసంగం నుండి బీఆర్ఎస్ వాకౌట్ .. చెవుల్లో పూలు పెట్టుకుని నిరసన

20-03-2026 02:10 PM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. శాసనసభ నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వాకౌట్(BRS walkout) చేశారు. చెవుల్లో పూలు పెట్టుకుని బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. బడ్జెట్ ప్రతులను బీఆర్ఎస్ సభ్యులు చించేశారు. తులం బంగారం మోసం, రెండు లక్షల ఉద్యోగాలు మోసం,  బడ్జెట్ అంతా మోసం, అంటూ నినాదాలు చేస్తూ అసెంబ్లీ ఎంట్రీ వద్ద నేతలు ధర్నా చేశారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆరు గ్యారంటీల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన చేపట్టారు.