12 May, 2026 | 9:59 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి

18-11-2025 12:00 AM

అలంపూర్, నవంబర్ 17: బీసీలు సమాజంలో ఎదిగినప్పుడే బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం దక్కుతుందని అందులో భాగంగానే మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే విజయుడు ఆకాంక్షించారు. ఈ మేరకు సోమవారం అల్లంపూర్ పరిధిలోని గుందిమల్ల, క్యాతూరు గ్రామాల సమీపంలో ఉన్న  కృష్ణానదిలో  చేప పిల్లల  విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2025- 2026 ఆర్థిక సంవత్సరానికి గాను 100 శాతం రాయితీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో  ప్రతిష్టాత్మకంగా చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.