స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం
19-05-2026 12:00 AM
చేగుంట, మే 18(విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామ శివారులో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ స్క్రాప్ షాప్ పూర్తిగా దగ్ధమైంది. పక్కనే టైల్స్ షాప్ కూడా ఆస్తి నష్టం సంభవించింది. ఎస్సె చైతన్య కుమా ర్రెడ్డి సమాచారంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.






