15 June, 2026 | 3:02 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

విద్యార్థిని చదువుకు ఆర్థిక సాయం అందజేత

10-06-2026 12:00 AM

జూబ్లీహిల్స్, జూన్ 9 (విజయక్రాంతి): తల్లిదండ్రులులేని ఓ నిరుపేద విద్యార్థిని చదువుకు నవ యువ నిర్మాణ్ స్వచ్ఛంధ సేవా సంస్థ ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచింది. సంస్థ డైరెక్టర్ వల్లాల ప్రవీణ్ కుమార్ (వెంకట్) యాదవ్ షేక్ పేట డివిజన్ కు చెందిన విద్యార్థిని చరితకు సంస్థ తరపున రూ.30వేల ఆర్థిక సాయం మంగళవారం అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ స్వచ్ఛంధ సేవా సంస్థను స్థాపించారన్నారు. విద్యార్థిని ఉన్నత చదువుకోసం ఆర్థిక సాయం చేయడమే కాకుండా భవిష్యత్తులో ఆమె ఫీజు బాధ్యతను కూడా భరిస్తామన్నారు. ఒక సోదరుడిగా అండగా నిలబడతామని ప్రకటించారు. విద్యా ద్వారా జీవితాల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు.