తాడువాయి శబరిమాత శిష్యులకు సన్మానం
23-08-2026 05:50 PM
బోథ్. ఆగస్ట్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి శబరిమాత ఆశ్రమం నుండి ఆదివారం శబరిమాత శిష్య బృందం మండలంలోని కౌటా(భి) గ్రామంలోని శబరిమాత ఆశ్రమానికి రావడం జరిగింది. కనుగుట్ట గ్రామంలో జరుగుతున్న ఖండ జ్యోతి కార్యక్రమానికి వచ్చిన శబరిమత ప్రియ శిష్యులను కౌటాభి గ్రామ ఆశ్రమ కమిటీ వారు ఆహ్వానించడంతో ఆదివారం రావడం జరిగింది. వారిని ఆశ్రమ కమిటీ సభ్యులు సన్మానించి పంపించారు.






