18 July, 2026 | 4:42 PM

పదోన్నతి పొందిన ఈఈకి సన్మానం

18-07-2026 04:31 PM

నిర్మల్,(విజయక్రాంతి): కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో రఘురాం సుభాష్ బాబు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B నిర్మల్ గా పదోన్నతి పొందిన సందర్భంగా శనివారం సన్మానం చేశారు. తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం నిర్మల్ జిల్లా తరఫున చేనేత కండువాకప్పి మార్కండేయ చిత్రపటం ఇచ్చి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బూర ఉమాశంకర్, ప్రచార కార్యదర్శి తురాటి ముతేష్, విశ్రాంత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెల్దండి అశోక్ కుమార్, కందూరి నర్సయ్య, సిరిపురం రాజేశ్వర్, జక్కని జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.