calender_icon.png 20 February, 2026 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం

20-02-2026 02:03:22 PM

కారు బైక్ ఢీ..ఒకరు మృతి.

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): కారు బైక్ ఎదురెదురుగా ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool district) వనపట్ల గ్రామ శివారులోని ప్రధాన రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న గన్నోజు సురేష్ చారి (40) వృత్తి రీత్యా దారువాజా కొలతలు తీసుకునేందుకు తన బైక్ పై పెద్దకొత్తపల్లి వెళ్లి తిరిగి పట్టణానికి వస్తుండగా హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారు నాగర్ కర్నూల్ నుండి సోమశిల వైపు కారులో వెళ్తున్న క్రమంలో కారు బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.