శాంతి భద్రతలకు కృషి చేయాలి
22-07-2026 11:56 AM
నూతన సీఐని మర్యాదపూర్వకంగా కలిసిన మాదారం కాంగ్రెస్ పార్టీ నాయకులు
జిన్నారం/ అమీన్ పూర్, జులై 22: బొల్లారం పోలీస్ స్టేషన్ సీఐ సుధీర్ కుమార్(Bollaram Police Station CI Sudhir Kumar) నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, మాదారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ సుదీర్ కుమార్ ను శాలువాతో సన్మానించి, వారు మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెండల మల్లేష్, సీతారాం యాదవ్, కుమార్, లింగం, రామకృష్ణ, నరసింహ,బజరంగ్ సింగ్, గోవింద్, కృష్ణ, రాజు పాల్గొన్నారు.






