15 June, 2026 | 2:04 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి

09-04-2026 01:02 AM

గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ వంగవేటి రామారావు

కోదాడ, ఏప్రిల్ 8 : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ వంగవేటి రామారావు అన్నారు. కోదాడ పీఏసీఎస్ పరిధిలో తమ్మరబండపాలెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం కల్పించే మద్దతు ధర, బోనస్, ఇతర ప్రభుత్వ పథకాలను రైతులు ఉపయోగించుకోవాలన్నారు.

రైతులకు మేలు చేసేందుకు తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందన్నారు. కోదాడ పీఏసీఎస్ ఇన్చార్జి కామినేని పద్మజ మాట్లాడుతూ రైతుల కోసం బాలాజీనగర్, కొమరబండ, తొగర్రాయి, కూచిపూడిల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఆర్డీఓ సూర్యనారాయణ, , తహశీల్దార్ వాజిద్ అలీ, కౌన్సిలర్ సామినేని రజిని నరేష్, గోపి, సుల్తాని సుజాత రాంబాబు, బత్తినేని హనుమంతరావు, సీఈఓ వెంకటేశ్వర్లు, కమతం వెంకటయ్య, రైతులు పాల్గొన్నారు.