ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం
15-06-2026 01:05 PM
దుండగుల తవ్వకాలతో ప్రాచీన శివాలయం ధ్వంసం
అలంపూర్ జూన్ 15: జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) అలంపూరు మండలం ర్యాలంపాడు గ్రామానికి వెళ్లే దారిలో తుంగభద్ర బ్రిడ్జి పక్కన ఉన్న ప్రాచీన శివాలయం(Shiva Temple) గుప్తనిధుల వేటగాళ్ల దుశ్చర్యకు గురైంది. ఆదివారం అర్ధరాత్రి వేళ దుండగులు ఆలయ గర్భగుడి, ఆవరణలో తవ్వకాలు చేపట్టి, విగ్రహాలను ధ్వంసం చేసి బయటకు విసిరేసినట్లు స్థానికులు ఆరోపించారు. గర్భగుడిలో గొయ్యి తవ్విన ఆనవాళ్లు కనిపించాయి.గ్రామ చరిత్రకు గుర్తుగా నిలిచిన ఈ పురాతన ఆలయాన్ని రక్షించాలని,తవ్వకాలకు పాల్పడిన వారిని గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.పురావస్తు శాఖ అధికారులు స్పందించి, ఆలయ పరిరక్షణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.






