28 June, 2026 | 2:07 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

యూరియా కోసం రైతుల గోస

31-12-2025 12:28 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో(Warangal district) రైతులు యూరియా(Urea) కోసం గోస పడుతున్నారు. యూరియా కోసం వ్యవసాయ శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన యాప్ సరిగా పనిచేయకపోవడంతో రైతులకు కష్టాలు మళ్ళీ మొదటికి వచ్చాయి. దీనితో వ్యవసాయ శాఖ అధికారులు సైతం యాప్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చేంతవరకు పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

దీనితో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామునే రైతులు రైతు వేదికలు, సొసైటీల వద్దకు ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం జిరాక్స్ పత్రాలతో తరలివచ్చారు. విపరీతమైన చలిలో సైతం రైతులు యూరియా కోసం తరలి రావడంతో వివిధ చోట్ల  పోలీసు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేపట్టారు. క్యూ పద్ధతి కోసం ప్రత్యేకంగా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రైతుకు సాగు భూమి ఆధారంగా ఒకటి నుంచి మూడు చొప్పున యూరియా బస్తాలు పంపిణీ చేశారు.