28 June, 2026 | 3:06 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

రేవంత్ రెడ్డికి చిన్న గుత్తేదారులు కనిపించడం లేదా?

31-12-2025 01:36 PM

బిల్లుల మంజూరులో నిర్లక్ష్యం ఎందుకు?

ప్రభుత్వ నిర్లక్ష్యానికి గుత్తేదారులు బలి

హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) మరోసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విరుచుకుపడ్డారు. 'మన ఊరు- మన బడి' గుత్తేదారులు బుధవారం నాడు హరీశ్ రావును కలిశారు. గుత్తేదారులకు బిల్లులను ప్రభుత్వం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 'మన ఊరు- మన బడి'(Mana Ooru Mana Badi) గుత్తేదారులు హరీశ్ రావుకు తమ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... గుత్తేదారులకు బిల్లులు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిల్లుల మంజూరులో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంది?, సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) చిన్నచిన్న గుత్తేదారులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గుత్తేదారులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.