12 July, 2026 | 4:13 PM

Breaking News

షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట   •   విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •  

కమ్మగూడలో పార్కు స్థలం కబ్జా

07-12-2025 12:00 AM

ఎమ్మెల్యే రంగారెడ్డికి కాలనీ వాసుల ఫిర్యాదు

తుర్కయంజాల్, డిసెంబర్ 6: తుర్కయంజాల్ సర్కిల్ పరిధి కమ్మగూడ శివాజీనగర్ కాలనీలో 3వేల గజాల పార్కు స్థలం కబ్జాకు గురైందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాజీ నగర్లో పార్కు స్థలాన్ని కబ్జారాయుళ్ల చెర నుంచి విడిపించాలని ఎమ్మెల్యేను కోరినట్లు తెలిపారు. ఈ స్థలాన్ని ప్రజా అవసరాలకు వినియోగించాలని సూచించారు.

అలాగే పార్కు స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి రక్షించాలన్నారు. అలాగే కాలనీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలని ఎమ్మెల్యే విన్నవించినట్లు తెలిపారు. కాలనీ వాసుల అభ్యర్థన పట్ల ఎమ్మెల్యే రంగారెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వల్లపు భాస్కర్ రెడ్డి,  కొండ సుధాకర్ రెడ్డి, బండ శ్రీనివాస్ రెడ్డి, కసిరెడ్డి శేఖర్ రెడ్డి, సత్యం గౌడ్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.