21 April, 2026 | 5:08 PM

Breaking News

రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •  

బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్

19-12-2025 11:04 AM

బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భద్రతా సిబ్బందికి, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో(Encounter) ఒక మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. భైరామ్‌గఢ్-ఇంద్రావతి ప్రాంతంలోని అటవీ కొండల్లో మావోయిస్టు కార్యకర్తలు ఉన్నారనే సమాచారం మేరకు జిల్లా రిజర్వ్ గార్డ్ బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించారు. ప్రస్తుతం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. గురువారం సుక్మా జిల్లాలో భద్రతా సిబ్బందితో జరిగిన ఎదురుకాల్పుల్లో, ఒక మహిళతో సహా మొత్తం 12 లక్షల రూపాయల రివార్డులు కలిగిన ముగ్గురు నక్సలైట్లు మరణించారని పోలీసులు తెలిపారు.