మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు
మరుగుదొడ్డి లెట్రిన్ సింక్ పక్కనే చలివేంద్రం కుండలు పెట్టిన వైనం
మనుషుల ఆరోగ్యాలతో చెలగాటమా అని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు
వేములపల్లి,(విజయక్రాంతి): మేం అధికార పార్టీ నాయకులo, ప్రజా ప్రతినిధులం మేం ఏమి చేసినా కరెక్టే మమ్మల్ని అడిగే వారే లేరు అన్న చందనంలో అధికార పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు నడుస్తున్నారని మండలంలోని లక్ష్మీదేవి గూడెం గ్రామంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి నిదర్శనమే ఈరోజు ప్రారంభించే చలివేంద్ర కుండలను గత మూడు రోజుల క్రితం తీసుకువచ్చి వాటిలో బాత్రూంలో నీళ్లు నింపి లెట్రిన్ సింకు పక్కనే పెట్టి రెండు రోజులు బాత్రూంలోనే ఉంచడమేమిటి అని ఆరోపిస్తున్న ప్రజలు. ఇలా లెట్రిన్ సింకుల పక్కన కుండలు పెట్టి వాటిని చలివేంద్రం కేంద్రంలో ప్రజలకు మంచినీళ్లు అందించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






