9 April, 2026 | 7:51 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ఎన్నికలు శాంతియుతంగా జరగాలి: ఎస్పీ నరసింహ

02-12-2025 12:41 AM

చివ్వెంల, డిసెంబర్ 1 : చివ్వెంల మండలంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను సూర్యాపేట ఎస్పీ కె. నరసింహ పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, బందోబస్తును సమీక్షించిన ఎస్పీ, గ్రామ ప్రజలు మరియు అభ్యర్థులకు ఎన్నికల నియమావళి పాటించాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులను బైండోవర్ చేస్తున్నట్లు తెలిపారు.

బైండోవర్ నిబంధనలు అతిక్రమిస్తే 25 లక్షల పూచీకత్తు విధిస్తామని హెచ్చరించారు. డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటును స్వేచ్ఛగా వినియోగించాలని, అభ్యర్థులు కూడా ప్రజలను ప్రలోభాలకు గురిచేయరాదని సూచించారు. ఎన్నికల ముందు 44 గంటలు ప్రచారం నిషేధం ఉంటుందని, ఈ సమయంలో గుంపులుగా చేరరాదని ఎస్పీ సూచించారు. ఈయనతో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రాజశేఖర్, ఎస్త్స్ర మహేష్ తదితరులు ఉన్నారు.