స్మశాన వాటికలో వృద్ధుడి మృతి
28-03-2026 02:13 AM
జవహర్ నగర్, మార్చి 27 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరే షన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని చెన్నాపురం స్మశాన వాటికలో వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడని తెలిపారు. మరణించిన వ్యక్తి సుమారు 50 నుండి 55 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉంటాడని చెన్నాపురం ప్రాంతంలో భిక్షాటన చేస్తూ ఉంటాడని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దావఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




