27 August, 2026 | 11:09 PM

Breaking News

ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలి   •   జూనోని పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి కష్టాలు   •   రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: షబ్బీర్‌ అలీ   •   రైతులకు శాశ్వత డిజిటల్ భూ రికార్డు సర్వే   •   జవాబు చెప్తే బెస్ట్ గిఫ్ట్ పెన్ను బుక్కు   •   గణపురంలో ఎంఆర్‌పీఎస్, ఎంఎస్‌పీ నూతన కమిటీ ఎన్నిక   •   కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డికి పిండ ప్రదానం చేసిన మాజీ ఎమ్మెల్యే   •   పలు గ్రామాల్లో సర్ గ్రామసభలు   •   ఇండ్ల స్థలాలకోసం జర్నలిస్టుల పాదయాత్ర బాధాకరం   •   గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచివేయడం సిగ్గుచేటు   •  

విద్యావ్యవస్థను మెరుగుపరచాలి

27-08-2026 07:28 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో విద్యావ్యవస్థను మెరుగుపరచి, విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డి.వై.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి దుర్గం రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. గురుకులాలకు సొంత భవనాలు, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. వాంకిడి బాలికల ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్లు, స్నానపు గదులు ఏర్పాటు చేయాలని, జనకాపూర్ బీసీ బాలికల వసతి గృహాన్ని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఆసిఫాబాద్ మోడల్ పాఠశాల వద్ద విద్యార్థుల భద్రత కోసం ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టరేట్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గెడం టికానంద్, కోశాధికారి దుర్గం నిఖిల్ పాల్గొన్నారు.