2 June, 2026 | 2:59 PM

మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఈడీ దాడులు

02-06-2026 01:41 PM

ముంబై: ఇటీవల టర్కీ నుండి భారత్‌కు తీసుకురాబడిన మాదకద్రవ్యాల స్మగ్లర్ మహమ్మద్ సలీం డోలాపై జరుగుతున్న మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం మహారాష్ట్ర, గుజరాత్‌లలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేంద్ర సంస్థ ఒక కేసు నమోదు చేసిన అనంతరం, ముంబైలో సుమారు 20 ప్రదేశాలతో పాటు గుజరాత్‌లోని సూరత్, అంక్లేశ్వర్ (భరూచ్ జిల్లా)లలో సోదాలు  నిర్వహించినట్లు తెలిపారు. డోలా అలియాస్ సలీం ఇస్మాయిల్ డోలా, ప్రపంచవ్యాప్తంగా వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడని ఆరోపణలు ఉన్నాయి.ఇతనిపై అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా సిండికేట్‌ను నడుపుతున్నాడని మాదకద్రవ్యాల నిరోధక సంస్థలు ఆరోపించాయి.