18 April, 2026 | 1:03 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

సృష్టి కేసులో ఈడీ విచారణ

22-10-2025 10:37 AM

హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్(Universal Srushti Fertility Center) కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) విచారణ చేస్తున్నారు. పాచిపల్లి నమ్రత అలియాస్ అథ్లూరి నమ్రతతో, కల్యాణి, నందిని, సంతోషి, జయంత్ కృష్ణను ఈడీ ప్రశ్నించనుంది. కోర్టు అనుమతితో చంచల్ గూడ జైలులోనే నిందితులను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. నిందితులను వారంపాటు ప్రశ్నించేందుకు కోర్టు ఈడీకి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారులు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. హైదరాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌తో ముడిపడి ఉన్న ఐవీఎఫ్, సరోగసీ కుంభకోణం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.