18 July, 2026 | 3:16 PM

Breaking News

శాకాంబరీ అలంకరణలో శ్రీ రేణుకా మాత.. భక్తుల వెల్లువ   •   వట్టివాగు ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి: కలెక్టర్   •   ఇసుక టిప్పర్ బీభత్సం.. బాలుడు మృతి   •   కరుణించని కారుమబ్బులు.. ఎదగని పంటలు... రైతన్న ఎదలో ఆందోళన   •   బీజేపీతో దేశానికి ప్రమాదం   •   పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే భవిష్యత్తులో సముచిత గుర్తింపు, పదవులు   •   వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి   •   పచ్చని పొలాల గూటికి చేరిన పొంగులేటి!   •   పోలవరంలో తీవ్ర విషాదం.. చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి   •  

సృష్టి కేసులో ఈడీ విచారణ

22-10-2025 10:37 AM

హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్(Universal Srushti Fertility Center) కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) విచారణ చేస్తున్నారు. పాచిపల్లి నమ్రత అలియాస్ అథ్లూరి నమ్రతతో, కల్యాణి, నందిని, సంతోషి, జయంత్ కృష్ణను ఈడీ ప్రశ్నించనుంది. కోర్టు అనుమతితో చంచల్ గూడ జైలులోనే నిందితులను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. నిందితులను వారంపాటు ప్రశ్నించేందుకు కోర్టు ఈడీకి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారులు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. హైదరాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌తో ముడిపడి ఉన్న ఐవీఎఫ్, సరోగసీ కుంభకోణం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.