16 March, 2026 | 9:00 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

బలవంతంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు

16-03-2026 03:54 PM

* ట్రాన్స్ జెండర్ల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ ప్రసన్న కుమార్

పాపన్నపేట: ట్రాన్స్ జెండర్లు ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని, శుభకార్యాలకు వెళ్లి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ హెచ్చరించారు. సోమవారం పాపన్నపేటలోని మంజీరా గార్డెన్స్ లో ట్రాన్స్ జెండర్లకు  అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సొసైటీలో అందరూ భాగస్వాములే అని, వివిధ గ్రామాలు, ఏడుపాయల్లో శుభ కార్యాలలో ఇష్టారీతిన డబ్బులు డిమాండ్ చేయవద్దన్నారు. గౌరవంగా ప్రవర్తించని యెడల చట్టం పరంగా చర్యలు ఉంటాయన్నారు. జిల్లా సంక్షేమ అధికారిణి హేమాభార్గవి, సీఐ జార్జి, ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.