17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

డ్రగ్స్ దాదా అరెస్ట్

04-10-2025 02:03 AM

ఎన్‌జీసీ కమాండోగా విధులు నిర్వ హిస్తూ డ్రగ్స్ రవాణా

200 కిలోల గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్న పోలీసులు

న్యూఢిల్లీ : డ్రగ్స్ దాదాగా పేరుగడించిన ఎన్‌ఎస్‌జీ కమాండోను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ, ఒడిశా నుంచి రాజస్థాన్‌కు గంజాయి రవాణా చేస్తూ బుధవారం రాత్రి పోలీసులకు దొరికిపోయాడు. రాజస్థాన్‌కు చెందిన బజరంగ్ సింగ్ ఏడేళ్ల పాటు నేషనల్ సెక్యురిటీ గార్డు (ఎన్‌ఎస్‌జీ) కమాండోగా విధులు నిర్వహించాడు. ౨౬/౧౧ ముంబై ఆపరేషన్‌లోనూ పాల్గొన్నాడు. అయితే, అతడికి రాజకీయంగా ఎదగాలన్న కోరిక ఉండేది. దీంతో అంతర్‌రాష్ట్ర స్మగ్లింగ్ నెట్‌వర్క్ ఏర్పర్చుకున్నాడు.

నేరస్తులతో పరిచయాలు ఏర్పర్చుకుని డ్రగ్స్  స్మగ్లింగ్ చేసేవాడు. అతడి తలపై రూ.25వేల రివార్డు ఉంది. రాజస్థాన్‌కు చెందిన యాంటీ నేషనల్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నిందితుడు పట్టుబడ్డాడు. నిందితుడు ఎక్కడికి వెళ్లినా ఒక వంట వాడిని తీసుకెళ్లేవాడని, వంటచేసే వ్యక్తి కదలికలపై నిఘా పెట్టడంతోనే సులువుగా పోలీసులకు చిక్కాడు.