ఆగస్టు 15 లోపు యూనిఫాంలు అందించాలి
29-07-2026 08:37 PM
డీఆర్డీఓ దత్త రావు
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సెర్ప్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్లో నిర్వహిస్తున్న స్కూల్ యూనిఫామ్ స్టిచింగ్ సెంటర్ను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తరావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టిచింగ్ పనుల పురోగతిని పరిశీలించి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఆగస్టు 15లోపు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ నాణ్యమైన యూనిఫాంలు పంపిణీ అయ్యేలా పనులను వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. స్టిచింగ్ పురోగతి, ఉత్పత్తి లక్ష్యాలు, నాణ్యత ప్రమాణాలపై సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏపీఎం పోమా నాయక్, అకౌంటెంట్ కరుణశ్రీ, సీసీలు పాల్గొన్నారు.






