20 June, 2026 | 3:35 PM

Breaking News

రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •   మండల ఉపసర్పంచుల ఫోరం   •  

రక్తదానం ప్రాణదానంతో సమానం

30-10-2025 12:11 AM

ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి 

ఎల్లారెడ్డి, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎల్లారెడి సిఐ రాజారెడ్డి, ఎస్త్స్ర మహేష్ కుమార్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారో త్సవాల భాగంగా బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్‌లో ఎల్లారెడ్డి సర్కిల్  పోలీస్స్టేషన్, ఆధ్వర్యంలో  నిర్వహించిన మెగా రక్తదాన, శిబిరంలో 55 మంది యువకులు, రక్తదానం చేశారు. అనంతరం సిఐ రాజారెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు సకాలంలో రక్తం అందక చాలా మంది మృత్యువాత పడుతున్నారన్నారు.

యువత సన్మార్గంలో పయనించి శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడా లని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ పోలీసులకు సహకరించాలన్నారు.ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు ఉండవని, పోలీసులు ప్రజల కోసమే 24 గంటలు విధి నిర్వహణలో ఉంటారన్నారు. అనంతరం మృతి చెందిన పోలీస్ అమరవీరులకు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎస్త్స్ర మహేష్, నాగిరెడ్డి పేట ఎస్త్స్ర భార్గవ్ గౌడ్, లింగం పేట ఎస్త్స్ర, దీపక్, గాంధారి ఎస్త్స్ర ఆంజనేయులు, పోలీస్ స్టేషన్ ల సిబ్బంది అనిల్ గౌడ్, బాలకృష్ణ, సాయికిరణ్, సందీప్ పాల్గొన్నారు.