కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో పుస్త్తె మట్టెల పంపిణీ
16-03-2026 12:00 AM
లింగంపేట్, మార్చి 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఎక్కపల్లి గ్రామంలో నీలా పరమేశం కూతురు పెళ్లి కీ కరీంనగర్ డైరి అధికారులు పుస్తే మట్టెలు 2.5(మాసాల నర) ఆదివారం పంపిణీ చేశారు.
కరీంనగర్ డైరీలో 225 రోజులు ఎవరైనా పాలు పోసిన వారి కూతురు పెళ్లికి కరీంనగర్ డైరీ తరపున రెండు మాసాల పూస్తే, మట్టెలు పంపిణీ చేయడం జరుగుతుందని మేనేజర్ సాయికుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ డైరీ మేనేజర్ సాయికుమార్, అసిస్టెంట్ మేనేజర్ రాజు, ప్రసిడెంట్ గోపాల్, సూపర్ వైజర్ సాయిలు, సర్పంచ్ దుర్గవ్వ, పర్వయ్య, ఉపసర్పంచ్ రవి, వార్డ్ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.




