16 March, 2026 | 10:56 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

గిరిజన మార్టు అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇవ్వండి

16-03-2026 12:00 AM

వ్యాపారస్తులను కోరిన ఐటీడీఏ పీవో రాహుల్ 

భద్రాచలం, మార్చి 15, (విజయక్రాంతి): ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ప్రత్యేక శ్రద్ధ మరియ ఎస్ హెచ్ జి గ్రూప్ మహిళలు చిన్న తరహా పరిశ్రమలు నడుపుకునే గిరిజన కుటుంబాలకు ఆర్థిక చేకూర్పు చేయడానికి ప్రారంభిస్తున్న భద్రగిరి మార్ట్కు భద్రాచలం పట్టణంలోని వ్యాపారస్తులు సలహాలు సూచనలు అందించాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు.

ఆదివారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో భద్రాచలం పట్టణంలోని ప్రముఖ వ్యాపారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై భద్రగిరి మార్ట్‌లో ప్రజలకు కావలసిన నిత్యవసర సరుకులకు సంబంధించిన సరుకుల జాబితాను అందించాలని అన్నారు.

ఇప్పటివరకు ఎస్ సి హెచ్ జి మహిళలు తయారు చేసే వివిధ రకాల ఆహార పదార్థాలకు సంబంధించిన నిత్యవసర సరుకులు అలాగే గిరిజన రైతులు పండించే వివిధ రకాల బియ్యం మరియు పప్పు దినుసులను పరిశీలించడం జరిగిందని, వీటితోపాటు ప్రస్తుతం మార్కెట్లో ప్రజలు ఎక్కువ శాతం కొనుగోలు చేసే నిత్యవసర సరుకులు నాణ్యత మరియు మన్నికైన వాటికి సంబంధించిన సరసమైన ధరల జాబితాను అందించి శ్రీరామనవమికి ప్రారంభించబోయే భద్రగిరి మార్ట్ దిగ్విజయంగా నడిచేలా సహకరించాలని వ్యాపారస్తులకు సూచించారు.  ఈ కార్యక్రమంలో ఏపీవో పవర్ వేణు, డీఎస్‌ఓ ప్రభాకర్ రావు, మేనేజర్ ఆదినారాయణ మరియు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.