11 July, 2026 | 8:57 PM

Breaking News

సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాల 16వ స్నాతకోత్సవం   •   జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •  

అనాథాశ్రమాల్లో నోట్‌బుక్స్, పెన్నులు, పండ్లు పంపిణీ

02-01-2026 12:00 AM

నిజామాబాద్, జనవరి1  (విజయ క్రాంతి): నూతన  పురస్కరించుకొని  అనాధ పెన్నులు పుస్తకాలను నోట్ బుక్స్ ను నిజామాబాదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, పంపిణీ చేశారు. నిజామాబాద్ నగరంలోని అనాధాశ్రమానికి చేరుకున్న ఆయన చిన్నారులతో సంభాషించారు, అక్కడి పిల్లలకు నోట్ బుక్స్, పెన్నులు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలతో మమేకమై, వారి భవిష్యత్తు లక్ష్యాలపై మాట్లాడారు.

పిల్లలు విద్యలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా చిల్డ్రన్స్ హోమ్ ఫర్ గరల్స్  ( బాల సధన్ ), శిశు గృహ స్పెషలైజ్ అడాప్షన్ సెంటర్  , హియరింగ్ ఎంపెయిర్ అనాధశ్రమాలు పర్యవేక్షణ చేశారు. అనాధాశ్రమాన్ని సందర్శించిన సీపీతోపాటు అదనపు డీసీపీ ( అడ్మిన్  ) జి బస్వారెడ్డి, టౌన్ 4 ఎస్. హెచ్. ఓ సతీష్ కుమార్, టౌన్ 3 ఎస్. ఐ హరిబాబు, అనాధ ఆశ్రమాల సూపర్డెంట్లు వినోద, శోభారాణి, అనిత తదితరులు పాల్గొనడం జరిగింది.