కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
29-04-2026 03:37 PM
చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధ వారం మంత్రి వివేక్ వెంకటస్వామి చేతులమీదుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలోని కోటపల్లి, జైపూర్ మండలాలకు చెందిన 144 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






